తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య.. ప్రధాని మోడీ తానా అంటే.. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తందానా అంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, వైఎస్ జగన్ కలిసి ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో దెబ్బ తీసేందుకు బీజేపీ, వైసీపీ కుమ్మక్కై ప్రణాళికలు రచిస్తున్నాయన్నారు. ఈ రకమైన రాజకీయాలు చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని, ఏ క్షణాన అయితే ప్రధాని మోడీని వైఎస్ జగన్ ప్రశ్నిస్తాడో.. ఆ మరుక్షణమే జగన్ జైలులో ఉంటారని ఎద్దేవ చేశారు వర్ల రామయ్య.
