48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం.
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ కలుసుకున్నారు.
బాధితులతో మాట్లాడి కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను వారిని అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్కు చిత్తశుద్ధి లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వెంటనే రాష్ట్ర ఆరోగ్యశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.