Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్‌ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ

టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్‌ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ

ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్‌ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్‌ తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు . విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే అనిత 2015 అక్టోబర్‌ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందుకు సంబంధించి గత ఎడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను ప్రామిసరీ నోటు, పోస్ట్‌ డేటెడ్‌ చెక్కును అనిత ఇచ్చారు . ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్‌ లేదని బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సివిల్‌ కేసుకు సంబంధించి 12వ అదనపు జిల్లా జడ్జి నుంచి కోర్టుకు హాజరు కావాలని అనితకు (ఓఎస్‌ నంబరు 434/2018)తో సమన్లు జారీ చేశారు. ఇక క్రిమినల్‌ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. ఇంకా మరోక ముఖ్య విషయం ఏమీటంటే తాను ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, కొంత అప్పు ఉందని, ఎమ్మెల్యేగా పరువు పోతుందని అనిత బతిమాలుకున్నారు. ఆమెపై నమ్మకంతో అప్పు ఇచ్చా. దఫదఫాలుగా సమకూర్చుకున్న రూ.70 లక్షల మొత్తాన్ని ఆమెకు ఒక్కసారిగానే అందజేశా. ఇంత వరకు ఆమె అప్పు తీర్చకపోగా..చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారు. అందుకే కోర్టును ఆశ్రయించా అంటున్నాడు వేగి శ్రీనివాసరావు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat