ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.అయిన ఇటీవల రాష్ట్రంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఇప్పుడు ఏమి ఎన్నికలు ఉన్నాయి జగన్ గెలవడానికి అని ఆలోచిస్తున్నారా ..?.ఎన్నికలు ఏమి లేకుండా జగన్ ఎలా విజయం సాధించారు అని ఆలోచిస్తున్నారా ..? .
అయితే జగన్ విజయం సాధించింది ఎన్నికల్లో కాదు .రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కుటుంబం అనే కార్యక్రమానికి తెర లేపిన సంగతి తెలిసిందే .జగన్ ప్రారంభించి సరిగ్గా రెండు వారాలు తిరగకముందే ముప్పై ఎనిమిది లక్షల మంది వైఎస్సార్ ఫ్యామిలీలో మెంబర్స్ గా చేరారు .
అంతే కాకుండా జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల హామీ వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన రోజు రోజుకు పెరుగుతుంది .దీంతో గతంలో టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమానికి ముందు నిర్వహించిన టీడీపీ సభ్యత్వం రెండు వారాల్లో నమోదు అయిన దాని కంటే వైఎస్సార్ కుటుంబం లో చేరిన వారు ఎక్కువ ఉండటంతో జగన్ ఎన్నికలకు ముందే చంద్రబాబు పై విజయం సాధించారు అని నేతలు అంటున్నారు .