ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయంటూ…రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునరావాస కేంద్రాలు అంటూ చంద్రబాబు, లోకేష్లు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అసలు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులన్నీ రాజకీయపరమైనవి కావు. స్థానికంగా ఆయా వర్గాల మధ్య ఉన్న విబేధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలు మాత్రమే. వీటిలో మెజారిటీ శాతం అసత్యాలే. టీడీపీ నేతలు చెబుతున్నంతగా
రాజకీయ దాడులు జరుగలేదని..అక్కడక్కడ జరుగుతున్నవి చిన్న చిన్న కొట్లాటలే అని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. దీనికి రాజకీయ రంగు పూసి వైసీపీ ప్రభుత్వమే తమ కార్యకర్తలపై కక్ష గట్టి భౌతిక దాడులకు దిగుతుందంటూ చంద్రబాబు, లోకేష్లు రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. స్వయంగా వైసీపీ బాధిత పునరావాస కేంద్రాలు అంటూ ఓ మీటింగ్ పెట్టి…టీడీపీ కార్యకర్తలచే సీఎం జగన్ను, ప్రభుత్వాన్ని తిట్టించి..తాము కూడా నాలుగు తిట్లు తిట్టి. ఆనందం పొందుతున్నారు ఈ తండ్రి కొడుకులు.
తాజాగా నారా వారి నాటకాలపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి డ్రామాలను నమ్మేవారు లేరని, ఇకనైనా నారావారి నాటకాలు బంద్ చేస్తే మంచిదని ఆమె హెచ్చరించారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై మాట్లాడుతూ…చంద్రబాబుకు, సీఎం జగన్ను విమర్శించే సీన్ లేదని ఎద్దేవా చేశారు. పునరావాస కేంద్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్న బాబు, లోకేష్లు… ఎమ్మార్వో వనజాక్షిని మీ ఎమ్మెల్యే చింతమనేని జట్టుపట్టుకుని లాగినప్పుడు, నారాయణ కాలేజీలో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు, కాల్మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఆడపిల్లల మాన, ప్రాణాలతో ఆడుకున్నప్పుడు, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముకున్నప్పుడు…బాధితులకు పునరావాస కేంద్రాలు పెట్టాలని గుర్తుకు రాలేదా చంద్రబాబు అంటూ పుష్ఫశ్రీ వాణి ప్రశ్నించారు. ఎవరు ఏంటో ప్రజలకు తెలుసని, చంద్రబాబు నాయుడి నాటకాలను, జగన్ పాలనా దక్షతల మధ్య తేడాను గుర్తించారని పుష్పశ్రీవాణి అన్నారు. మొత్తంగా సీఎం జగన్ వంద రోజుల ప్రజారంజక పాలన చూసి తట్టుకోలేకపోతున్న తండ్రి కొడుకులు ఇలా పునరావాస కేంద్రాలు అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ చంద్రబాబు, లోకేష్లపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.