Home / ANDHRAPRADESH / యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!

యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!

ఏరు దాటేంతవరకు మంచి మల్లన్న..ఏరుదాటాకా బోడి మల్లన్న..అదే ఇంకోరకంగా చెప్పాలంటే అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన తన అవసరాలకు భుజాలకెత్తుకుని మళ్లీ తన ప్రతిపక్షం లో వుంటే మాత్రం తనకు సాయపడిన వారిపై U టర్న్ తీసుకోవడం లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ది సపరేట్ రూట్.

ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ సీఎం‌చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తన యూటర్న్ మార్గాన్ని ఎంచుకున్నాడని పార్టీ నేతలే చెప్పు కుంటున్నారు.ఎన్నికలు సమయం లో రాహుల్ గాంధీ తో పొత్తు కోసం మోడీ ని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు నాయుడు రాజకీయంగా కాంగ్రెస్ కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపి కి దగ్గరకావాలని కొత్తకుట్రలకు సిద్దమవుతున్నాడు..బాబును నమ్మిన కాంగ్రెస్ కి ఈ యూ టర్న్ కొత్త షాకునిస్తోంది..అయితే ఓ వైపు ఏపి బీజేపి ఇంచార్జ్ వున్న సునీల్ దియోధరా మాత్రం బాబు ను ఎట్టి పరిస్థితులలో కూడా బాబు తీసుకోవాలనుకుంటున్న యూటర్న్ కి గేట్ లు క్లోజ్ చేసామని చెబుతున్నాడు..అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు,లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని టీడిపి నేతలు చెబుతున్నారు..ఎన్నికల సమయంలో మోడీని,అమిత్ షాను రాయకూడని భాషలో తిట్టిన తాము మళ్లీ బీజేపి ను‌పొగడ్తూ మాటాడాలంటే సిగ్గుగా వుందని యూటర్న్ పై మదనపడుతున్నారు

యూటర్న్ సిగ్గుపడేలా యాటర్న్ లు

రాజకీయంగా యూటర్న్ లే కాదు, ప్రత్యేక హోదాపై ,రాష్ట్రాభివృద్ధిపై టర్న్ లపై యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు తన హయాం లో భుజాలకెతుకున్న కాంట్రాక్టర్లను,వ్యాపారవేత్తలపై కూడా యూ టర్న్ లు తీసుకుంటూ తన వక్రబుద్ధిని‌ బయట పెట్టుకుంటున్నారని పారిశ్రామికవేత్తలు ఆయన ధోరణి పై మండిపండుతున్నారు.అయితే బాబు నిర్ణయం‌వల్ల పోలవరం పనుల్లో నవయుగ భారీగా నష్టపోయిందనే నిజాలూ ఉన్నాయి. ఇక పట్టి సీమ, ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు ప్రాజెక్టు పనులను మేఘా కృష్ణారెడ్డి కి అప్పజెప్పాడు చంద్రబాబు.

2016 జూలై 6 న ఘనంగా పట్టిసీమను ప్రారంభించాడు.పట్టి సీమను సకాలంలో పూర్తి చేసినందుకు మేఘా కృష్ణా రెడ్డిని కూడా భారీ బహిరంగ సభ పెట్టి సన్మానించాడు చంద్రబాబు.పట్టిసీమ పనులు జరిగినప్పుడు చైనా మోటర్స్ తో ,చైనా టెక్నాలజీ తో ప్రాజెక్ట్ పూర్తి చేసామని ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారిన వెంటనే చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందన్న బిల్డప్ ఇస్తూ అభివృద్ధి పనులపై మళ్లీ యూటర్న్ లు తీసుకోవడం వంటిహేయమైన చర్య ఆయనకే చెల్లిందని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

యూటర్న్ టూ యూ టర్న్

ఇక రాష్ట్రం లో పెట్టుబడులు కోసం ప్రజాధటర్న్ ఖర్చుపెట్టి చైనా, జపాన్,సింగపూర్, మలేషియా, లలో తిరిగి అక్కడి టెక్నాలజీ తో ఏపి ను సింగపూర్ చేస్తానన్న బాబు ఇప్పుడు కేవలం చైనా మోటర్ల విషయంలో తెలివి తక్కువగా మాట్లాడటం అందరిని విస్మయపరుస్తోంది.చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని చైనా లో ప్రెస్‌ మీట్ పెట్టి మరి చెప్పాడు..చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీలు మాత్రం ఐదేళ్లలో‌నయాపైసా పెట్టుబడి పెట్టలేదు.ఇక పట్టిసీమతో పాటు ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు లాంటి ప్రాజెక్టులు దాదాపు 38వేల కోట్ల రూపా మేఘా కృష్ణారెడ్డి కి కట్టబెట్టాడు చంద్రబాబు అప్పుడు పట్టిసీమను పూర్తి చేసినందుకు గాను సన్మానాలు జరిపిన మాజీ సీఎం చంద్ర బాబు ఇప్పుడు మేఘా కంపెనీ పై విశాఖపట్నం లో మాటాడిన తీరు ఆయన దుర్మార్గపు రాజకీయాన్ని బయటపెట్టి మరో యూటర్న్ తీసుకున్నాడు. తన పచ్చమీడియా ,సోషల్ మీడియా భజనబృందాలతో పారిశ్రామికవేత్త లపై విషం కక్కిస్తూ మోసగించడంలో కొత్త యూటర్న్ తీసుకున్నాడు.

బాబు కు యూటర్న్ లు కొత్తకాదు..యూటర్న్ కు బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం.. నాలుగునెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభానికే,పచ్చ జాతికి తప్ప జనానికి ఉపయోగపడేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని‌ వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటంతో ఇప్పుడు రోడ్లపై యూటర్న్ లు మాయమై బాబు ఫోటోలతో నిండిపోయాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat