Home / ANDHRAPRADESH / టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్‌ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి దేవినేని అవినాష్‌ మొదటి నుంచి పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఈ మేరకు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ…పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల టైమ్‌లో అవినాష్‌కు బదులు  బోడె ప్రసాద్‌‌కు పెనమలూరు టికెట్ ఇచ్చారు.  అవినాష్‌కు మాత్రం  ఓడిపోయే స్థానం అయిన గుడివాడ టికెట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నికలకు ఖర్చులు భరిస్తానని బాబు ఇచ్చిన హామీ మేరకు అవినాష్‌ దాదాపు 20 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు సమాచారం. అయినా  కొడాలి నాని చేతిలో  ఓటమి పాలవ్వక తప్పలేదు. అయితే ఆర్థికంగా ఆదుకుంటాడని అవినాష్ ఆశించారు. కానీ లోకేష్‌ అడ్డుపడ్డాడు..దీంతో తండ్రీకొడుకుల మోసంపై రగలిపోయిన అవినాష్ తనను నమ్ముకున్న అనుచరుల కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. సీఎం జగన్ కూడా పార్టీలో చేరిన వెంటనే అవినాష్‌కు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి…సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు మంత్రి కొడాలినాని, పార్థసారథి వంటి నేతలు అవినాష్‌కు చేదోడువాదోడుగా ఉంటున్నారు. వైసీపీలో చేరిన తర్వాత అవినాష్ చంద్రబాబు, లోకేష్‌ల మోసంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. తనను కావాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాకుండా గుడివాడ నుండి ఎన్నికల బరిలోకి దించి తన ఓటమికి కారణమయ్యారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు దగ్గరనుండి ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు అని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు చాలామంది బాబు తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారని ఆరోపించారు. ఇక రాజధాని రైతులు సైతం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని అవినాష్ మండిపడ్డారు. బాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే టీడీపీ భ్రష్టు పట్టడానికి కారణమని అవినాష్ తేల్చి చెప్పారు. టీడీపీలో ఉన్నంతకాలం ఆ పార్టీకి ఉపయోగపడ్డానని చెప్పిన ఆయన ఇప్పుడు వైసీపీలో స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తానని చెప్పారు. అలాగే టీడిపిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదని, భూకబ్జాలు చేయలేదని, నేరారోపణలేవి తనపై లేవని అవినాష్ పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు మోసగాడు అంటూ దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat