విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేష్ సమాధానం చెప్పారు. ఎయిడెట్ కాలేజీలు, స్కూల్స్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎయిడెట్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కోసం ఓ రూల్స్ ప్రకారం సకాలంలో ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఇది ప్రస్తుతం చాలాచోట్ల జరగడం లేదు. ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగు పరుస్తామని స్పష్టంగా చెప్పామన్నారు.
నవరత్నాల్లో భాగంగా ఉపాధ్యాయుల స్థితిగతులను మార్చుతాం.. రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ ఏర్పాటుచేశాం. దీని పరిధిలోని వీరిని తీసుకొచ్చామన్నారు. టీచింగ్ కమ్యూనిటీని రెగ్యులరైజ్ చేయాలని, వారి జీవన ప్రమాణాలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అవకాశం ఉన్న మేరకు న్యాయం చేస్తామన్నారు. ఎయిడెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను గతంలో భర్తీ చేయలేదు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యా నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక వసతులు పెంచాల్సి ఉందని సురేష్ తెలిపారు. టీడీపీ ఇంగ్లీష్ మీడియం గురించి చేస్తున్న రాద్దాంతాన్ని సురేష్ తప్పుబట్టారు. ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు.