పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్లో షరామామూలుగానే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించింది. దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలు పట్టినట్లే అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు..పోలవరంతో సహా ఏపీకి పెద్దగా కేటాయింపులేవి లేవు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్థిక మాంద్యం వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టారంటూ పవన్ కల్యాణ్ తెగ మోసేశారు. ముఖ్యంగా రైతాంగానికి రూ.15 లక్షల కోట్ల రుణం కల్పించాలన్న ఆశయం, రూ. 2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అలాగే ఆదాయపన్నుకు సంబంధించి ఏడు శ్లాబుల పాలసీ విధానం ఆయా ఆదాయ వర్గాలకు చాలా ఊరట కలిగిస్తుందని, ఈ విషయంలో ప్రధాని మోదీకి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఆదాయపన్నుకు గతంలో ఉన్న మినహాయింపులన్నింటిని ఎత్తేశారు. దీంతో గతంలో కంటే పన్ను ఎక్కువగా కట్టాల్సి వస్తుందని…నిపుణులు అంటున్నారు. పన్ను మినహాయింపులు ఎత్తేసిన అంశాన్ని పవన్ గుర్తించలేకపోవడం అజ్ఞానమనే చెప్పాలి. ఇక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కల్యాణ్కు ఇప్పుడు కేంద్ర బడ్జెట్ రుచిగా ఉండడం చూస్తుంటే..పొత్తు మహిమ బాగా పని చేస్తుందనే చెప్పాలి. ప్రత్యేక హోదాపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినా పవన్ మాట్లాడకపోవడం గమనార్హం. ఇక పోలవరంతో సహా ఏపీకి నిధుల కేటాయించకపోవడంపై మిత్రుడిగా మోదీ సర్కార్ను ప్రశ్నించడం మాని…జగన్ ప్రభుత్వం వల్లనే అని నిందించడం చూస్తుంటే..గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు బదులు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసిన వైనం గుర్తుకువస్తుంది. అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో పవన్ టార్గెట్ ఒక్కటే…వైసీపీని టార్గెట్ చేయడం..అప్పుడు చంద్రబాబుకు వత్తాసుపలకడం..ఇప్పుడు బీజేపీకి కాపు కాయడం….అంటే పరోక్షంగా చంద్రబాబుకు కాపుకాయడమే..అందుకే పాచిపోయిన లడ్డూలాంటి బడ్జెట్ కూడా.. కమ్మగా ఉంది…అంతేగా పవనూ..