ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని మరిచి, అమలు కానీ హామలు గుప్పించి అధికారం చేపట్టిన టీడీపీ, 2019 ఎన్నికల్లో మాత్రం అధికారం చేజిక్కించుకోవాల నుకుంటున్న చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పనిసరి అంటోంది ఆ సర్వే. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సగానికిపైగా శాసనసభ స్థానాలను కోల్పోతుందని, అలాగే, టీడీపీ మంత్రులు 26 మందిలో కూడా ఓ నలుగురు తప్ప మిగతా వారికి ఓటమి తప్పదని సర్వేలో వెల్లడైంది. ఈ విషయం తన సొంత సర్వేలోనే వెల్లడి కావడంతో చంద్రబాబుకు చుక్కలు కనిపించాయి.
పార్టీ మెరుగ్గానే ఉంది కదా..! కాకపోతే తెలంగాణలో మాత్రమే పార్టీ పరిస్థితి అటు.. ఇటుగా ఉందిలే అంటూ అనుకుంటూ వచ్చిన చంద్రబాబుకు ఈ సర్వే వివరాలను చూసిన తరువాత నిద్ర పట్టడం లేదంట. అంతేగాక, సర్వేలో విస్తుపోయే విషయాలు బయటకు రావడంతో చంద్రబాబుకు మింగుడుపడటం లేదంట. ఇప్పుడు అధికారంలో ఉన్న తమకు వచ్చే ఎన్నికల్లో కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే వెల్లడైంది. తాను చేయించిన సర్వేలోనే తమ పార్టీకి వ్యతిరేకంగా సర్వే రావడంతో ఖంగుతిన్న చంద్రబాబు.. ఈ సర్వే విషయాలను బహిర్గతం చేయొద్దంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.