అవును.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు 40 ఏళ్ల అనుభవం చిన్నబోయింది. ప్రజల సంక్షేమానికి కావాల్సింది సీనియారిటీ వల్ల వచ్చిన కుఠిల రాజకీయాలు కాదని నిరూపిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. అదీ కూడా నారావారిపల్లిలోనే కావడం గమనార్హం.
ఇక అసలు విషయానికొస్తే.. ఏ చిన్న పనిచేయాలన్నా.. డాష్ బోర్డుల మీద ఆధారపడే చంద్రబాబు ఇప్పుడు ఇళ్లచుట్టూ తిరిగే పనిలో పడ్డాడు. ఇంతకీ చంద్రబాబుకు ఏమైందనుకుంటున్నారా..? అదేం లేదండీ బాబోయ్.. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారి సమస్యలకు పరిష్కారాల ప్రణాళికలను రచిస్తూ.. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తెలుగువారి పండుగ సంక్రాంతి నాడు నారావారిపల్లిలో తన పాదయాత్ర నిర్వహించారు.
వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా చంద్రబాబుపై నారావారిపల్లిలో తిష్టవేసిన సమస్యలపై మాట్లాడారు. స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లిలో కనీసం పీహెచ్సీ లేదని, 40 ఏళ్ల రాజకీయం, అందులోను పదేళ్లు ముఖ్యమంత్రిగాను, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగాను ఉన్న ఒక రాజకీయ నాయకుడి గ్రామంలో పీహెచ్సీ లేకపోవడమేంటని ప్రశ్నించారు. సొంత గ్రామానికే ఏమీ చేయలని చంద్రబాబు.. ఇక ఏపీని సింగపూర్లా ఎలా మారుస్తారని ప్రశ్నించారు వైఎస్ జగన్.