Home / ANDHRAPRADESH / ద‌ళితుల కోసం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం..!!

ద‌ళితుల కోసం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం..!!

ఎస్సీలుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా..? అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు గ‌తంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నమైందో అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఆ వ్యాఖ్యలు ప్ర‌తి ద‌ళితుడుని బాధించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు.

అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో.. ద‌ళితుల సంక్షేమం కోసం ఒక సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు వైఎస్ జ‌గ‌న్‌. అయితే, వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాయ‌ల సీమ జిల్లాల‌ను దాటి సీమాంధ్ర‌లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ను ద‌ళితులు క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుపుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే నాడు ద‌ళితుల‌పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లను గుర్తుచేసుకుని బాధ‌ప‌డ్డారు. అంతేగాక, టీడీపీ అధినేత నుంచి సామాన్య టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం మాపై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారిని ఓదార్చిన అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. మ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ద‌ళితుల సంక్షేమం కోసం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చాక జ‌రిగే మొట్ట మొద‌టి అసెంబ్లీ సమావేశంలో ద‌ళితుల భూముల‌ను ఇత‌రులు ఆక్ర‌మించుకోకుండా ప్ర‌త్యేక చ‌ట్టం తెస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌న రాజ‌న్న ప్ర‌భుత్వం వ‌స్తే ద‌ళితులే రాజులుగా ఉంటార‌ని, ద‌ళితుల‌పై దాడులు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ట్టాలు చేస్తామ‌ని చెప్పారు వైఎస్ జ‌గ‌న్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat