Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు బినామీల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న సీబీఐ..!

చంద్ర‌బాబు బినామీల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న సీబీఐ..!

చంద్ర‌బాబు బినామీల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న సీబీఐ..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! అమ‌రావ‌తి, ఇది కేవ‌లం రాజ‌ధాని ప్రాంత‌మే కాదు. ఐదుకోట్ల ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ రాజ‌ధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజ‌కీయంగా, పాల‌నా ప‌రంగా 40 ఏళ్లు అనుభ‌వం ఉందంటూ మీడియాల‌తో ప్ర‌చారం చేయించుకునే సీఎం చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మిన రైతులు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోస‌మ‌ని 36వేల ఎక‌రాల‌కుపైగా భూముల‌ను ప్ర‌భుత్వానికి ధారాద‌త్తం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, కోట్ల రూపాయ‌లు విలువ చేసే ఈ భూములు ఇటు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తోపాటు.. అటు సీఆర్డీఏ అధికారుల చేతివాటంతో ప‌క్క‌దారిప‌ట్టాయి. మంత్రులు అయితే ఒక అడుగు ముందుకేసి… వారి బంధువుల‌తోపాటు, రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇవ్వ‌ని వారికి కూడా అమ‌రావ‌తిలో రెసిడెన్షియ‌ల్ ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ ప్లాట్లను క‌ట్ట‌బెడుతున్నారు.

మ‌రి, చిన్న చిన్న చోటా నాయ‌కులే భూ దందాల‌తో చెల‌రేగుతుంటే.. ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు మాత్రం ఊరుకుంటాడా..? అస‌లే 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం. అందులోనూ దేశంలోని ఏ ముఖ్య‌మంత్రిపై లేని అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న ఏకైక ముఖ్య‌మంత్రి. అటువంటిది కోట్లు విలువ చేసే భూముల‌ను వ‌దులుతాడా..? రాజ‌ధాని ప్రాంతం ప‌రిధిలోగ‌ల తుళ్లూరు, ఉద్దండ్రాయునిపాళెం, మంద‌డం, పెనుమాక ప్రాంతాల్లో రూ.890 కోట్లు విలువ‌గ‌ల భూముల‌ను స్వాహా చేశార‌ని, కేవ‌లం ఆ నాలుగు గ్రామాల్లోనే రూ.890 కోట్ల లావాదేవీలు జ‌రిపిన చంద్ర‌బాబు, భూముల‌ను త‌న బినామీల పేరిట రిజిస్ర్టేష‌న్ చేయించారంటూ ఓ క‌థ‌నం సోస‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ క‌థ‌నంపై రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులే అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

see also :

కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిక..!

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు అమ‌రావ‌తి భూమి లెక్క‌ల గుట్టును అధికారికంగా తేల్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే సీబీఐ విచార‌ణ‌కు రంగం సిద్ధం చేసింది. అంతేకాకుండా, గ‌తంలో అమ‌రావ‌తి ప్రాంతంలో భారీ భూ కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని విప‌క్షాల‌తోపాటు, రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులే ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పూర్తి ఆధారాల‌తో భూ దందా గుట్టును తేల్చేయాల‌ని భావించిన సీబీఐ పైన పేర్కొన్న తుళ్లూరు, ఉద్దండ్రాయునిపాళెం, మంద‌డం, పెనుమాక ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులు, అలాగే, వాటిని కొనుగోలు చేసిన వారి ఆధార్ కార్డులను నిశితంగా ప‌రిశీలిస్తోంది. రాజ‌ధాని భూముల కుంభ‌కోణంపై సీబీఐ గ‌నుక విచార‌ణ వేగ‌వంతం చేస్తే.. చంద్ర‌బాబుతో స‌హా, అత‌ని బినామీలు జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌న్న సంకేతాల‌ను ఇస్తోంది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat