Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ స‌మక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయ‌కులు వైసీపీలోకి..!!

జ‌గ‌న్ స‌మక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయ‌కులు వైసీపీలోకి..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 173వ రోజు ఇవాళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోక‌వ‌ర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభ‌మైంది. జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఇలా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణను చూసిన ప‌లు పార్టీల సీనియ‌ర్ నేత‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

అయితే, తాజాగా వైఎస్ జ‌గ‌న్ పీ.గ‌న్న‌వ‌రం వైసీపీ నాయ‌కులు కొండేటి చిట్ట‌బ్బాయి, సీఏసీ స‌భ్యులు కుడిపూడి చిట్ట‌బ్బాయి, మిదిగుండి మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో 50 మంది నాయ‌కులు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీలో చేరిన వారిలో వార ల‌క్ష్మీన‌ర‌సింహం, మాజీ ఎంపీటీసీ బొక్క ఏడుకొండ‌లు బొబ్బిలి దుర్గారావు, దామిశెట్టి అంజిబాబు, మాజీ స‌ర్పంచ్ క‌డ‌లి రామ‌కృష్ణ‌, మ‌ట్ట‌ప‌ర్తి న‌వీన్ త‌దిత‌ర టీడీపీ నాయులు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat