నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!
SEE ALSO:
మోదీని ప్రధానిగా దేశ ప్రజలు ప్రధానిగా నిర్ణయించారని.. చంద్రబాబును ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడూ ఎవరూ నిర్ణయించలేదని సోము వీర్రాజు అన్నారు. కొడుకును ముఖ్యమంత్రి చేసి.. తాను ప్రధాని కావాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆరోపించారు. 2014లో బీజేపీ, జనసేన పార్టీల వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ సహకరించలేదన్నారు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత మనస్తత్వం ఉన్న నాయకుడు దేశంలో ఇంకెవరూ లేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు.
see also:లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
see also: