విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు మంజూరు చేయమని సంవత్సరం నుండి ఎమ్మెల్యే బోండా ఉమా ఆఫీస్ కు తన కూతుర్లు కాళ్ళు అరిగేల తిరిగారని జ్యోతి చెపుతుంది.
గత ఏడాది ఎమ్మెల్యే అనుచరుడు కౌశిక్ సర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి హత్యాచారానికి పాల్పడ్డారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని చెప్పుకొచ్చింది.కేసు పెట్టామన్న కోపంతో ప్రతీరోజు వాళ్ళని మానసికంగా హింసిస్తున్నారని చెప్పింది.ఈ విషయం పై ఈ నెల 4వ తేదీన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కి చెప్పడానికి వెళ్ళిన తన పిల్లలు ఇద్దరు కనిపించడం లేదని ఆందోళన చెందుతుంది.బంధువులు మరియు తెలిసినవారి ఇంట్లో ఆరా తీసినా ఆచూకీ ఏమీ తెలియలేదు. దీంతో జ్యోతి ఆదివారం రాత్రి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే తన పిల్లలపై కక్ష సాధించడానికి కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది.ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.