ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి ప్రభావం టీడీపీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల… సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడగా… తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబుకి షాకిచ్చారు. చలమారెడ్డి టీడీపీ వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించినున్నట్లు తెలుస్తుంది. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి…పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది.తాజాగా మాచర్లలో తన ఇంట్లో బీజేపీ నేతలకు చలమారెడ్డి తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు సోము వీర్రాజు, నలమోలు వెంకట్రావు హాజరయ్యారు. త్వరలోనే చలమారెడ్డి కాషాయి కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
