గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. రివర్స్ టెండరింగ్కు గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో పాలుపంచుకున్న నవయుగ సంస్థ కూడా పాల్గొనవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్కు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం అనసరంగా కక్ష గట్టి రివర్స్ టెండరింగ్కు వెళ్లి పోలవరం నిర్మాణ పనులను ఆపేసిందంటూ టీడీపీ విమర్శించింది. అయినా సీఎం జగన్ వెనకడుగు వేయకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్లగా..ఇప్పుడు అది సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే మొత్తం పని విలువలో 43 కోట్ల తక్కువకు ఓ సంస్థ ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 274 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పనికి రివర్స్ టెండరింగ్కు వెళితే… ఓ సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు తెలిసింది. అంటే గతంలో పోలిస్తే రివర్స్టెండరింగ్ ద్వారా 43 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. కేవలం మూడు వందల కోట్ల పనిలోనే రివర్స్ టెండరింగ్లో ఇంత ఆదా ఉంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్ వర్కస్ సంబంధించిన పనుల్లో ఎంత మొత్తం ఆదా అవుతుందో ఊహించుకోవచ్చు. అయితే ఎల్లోమీడియా మాత్రం టెండర్ తక్కువ కోట్ చేసిన సంస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మళ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులలో ధరలు పెంచకుడా ఉంటారా..ఎస్టిమేషన్లు పెంచరని గ్యారంటీ ఉందా.. అంటూ పచ్చ కథనాలు వండి వారుస్తోంది. అయితే ఇప్పుడు ప్రతీది పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసిందనే విషయాన్ని ఎల్లో మీడియా మర్చిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో నిర్మాణ పనుల్లో ఎస్టిమేషన్లు పెంచినా..అది జ్యుడీషియల్ కమిటీ సిఫార్స్ మేరకే జరుగుతుంది తప్ప..మరొకటి కాదు..ఇక అందులో అవకతవకలకు ఆస్కారం ఏముంటుంది. రివర్స్ టెండరింగ్తో ప్రభుత్వానికి 43 కోట్లు ఆదా కావడాన్ని చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతుంది..అంతే…మొత్తంగా జగన్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఆదిలోనే సత్ఫలితాలను ఇవ్వడం శుభసూచకమే అని చెప్పాలి.
