చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి నేతల వరకు ఇసుకను దోచుకుని వేలాది కోట్లు గడించారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై ప్రభుత్వానికి గత ఐదేళ్లలోనే 2,800 కోట్లు వేల కోట్ల ఆదాయం వస్తే..ఏపీలో మాత్రం రూ.116 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఏపీలో టీడీపీ నేతలు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ స్థాయిలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారా అర్థమవుతుంది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు. అక్రమ ఇసుక రీచ్లన్నీ రద్దు చేశారు. అంతే కాకుండా నూతన ఇసుక పాలసీ రూపొందించి.. టన్ను ఇసుక రూ. 375/- గా నిర్ణయించారు. అంతే కాదు ఇసుక రవాణా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఇస్తామని ప్రకటించారు. అయితే ఈలోగా రాష్ట్రంలో భారీగా వర్షాలు పడి నదులు, వాగులు, చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఇసుక తీయడం అసాధ్యంగా మారడంతో ఇసుక రవాణా కొద్ది మేర ఆగిపోయింది. కాని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో సహా, టీడీపీ నేతలు ఇసుక కొరతకు ప్రభుత్వమే కారణమని, సీఎం జగన్ ఇసుకాసురుడు, భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారంటూ..దుష్ప్రచారం చేయడం మొదలెట్టారు. బాబుగారి పార్టనర్ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా ఇసుక కొరత అంటూ ప్రభుత్వంపై గొంతు చించుకుంటున్నాడు. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారంటూ నవంబర్ 3 న విశాఖలో భారీ ర్యాలీకి పవన్ సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నిండుకున్న జలశయాల్లో ఇసుక తీయడం అసాధ్యంగా మారింది. అయినా చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఇసుకపై రాజకీయం చేస్తున్నారు. పార్టనర్లు ఇసుక రాజకీయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇసుకపై పార్టనర్లు చేస్తున్న నీచరాజకీయాన్ని ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా అంటూ..తన గ్రామంలో నిండుగా ప్రవహిస్తున్న చెరువు వద్ద నిలబడి 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరువులన్నీ నిండాయని, ఇలాంటి సమయంలో ఇసుక ఎలా తీస్తారంటూ ఆ యువకుడు బాబు, పవన్లను ప్రశ్నించాడు. ఇసుకపై విషప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్న పార్టనర్లు ఇద్దరూ గుంటనక్కలు, తోడుదొంగలు అంటూ తీవ్రంగా విమర్శించాడు. చెరువుల్లో నీళ్లు ఉంటే ఎలా ఇసుక తీస్తారు..బుద్ధి ఉండి మాట్లాడాలంటూ బాబు, పవన్లపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
ఇసుకపై నీచ రాజకీయం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కనువిప్పు కలిగేలా మాట్లాడినా సామాన్యుడుఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలతో నదులు వాగులు ఇసుక రిచుల్లో భారీగా నీళ్లు రావటంతో ఇసుకకు ఆటంకం కలుగుతుంది అనేది నిజం ….
Posted by The Real Leader-Jagan on Tuesday, 22 October 2019