ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను వైయస్ఆర్ విద్యాపురస్కారాలుగా మార్చుతూ జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఈ పేరు మార్పు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిన సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండా ఏకంగా కలాం పేరు మార్చడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే పేరు మార్చుతూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని, గతంలోలాగానే కలాంపేరుతోనే విద్యాపురస్కారాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు ఇక నుంచి కలాం పేరుతో పాటు పాటుగామహాత్మాగాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్రాం వంటి మహనీయుల పేర్లతో ఈ ప్రతిభా అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ పాఠశాల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తనకు ఈ విషయంలో ఏ మాత్రం సంబంధం లేకున్నా….కొందరు అధికారులు చేసిన తప్పుకు వెంటనే స్పందించి..ఆ తప్పును సరిదిద్దుకున్న సీఎం జగన్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఒక కలాం పేరుతోనే కాదు జాతీయ నాయకులందరి పేరుతో అవార్డులు ఇవ్వాలని ఆదేశించడంతో సీఎం జగన్కు మహనీయులైన దేశనాయకుల పట్ల ఎంత గౌరవ భావం ఉందో అర్థమవుతుంది. మొత్తంగా ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు మార్చిన వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా..వెంటనే సరిదిద్దుకున్న సీఎం జగన్ నిజంగా అభినందనీయుడు.