Home / ANDHRAPRADESH / హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!

హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌ నగరంలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 5 , మంగళవారం నాడు. జూబ్లిహిల్స్‌లోని జలవిహార్‌ రామరాజుగారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అద్భుతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారు స్వయంగా చేసిన అభిషేకం భక్తులను, మహిళలను మంత్ర ముగ్దులను చేసింది. పూజల అనంతరం స్వామి వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, హిందూ ధర్మ గొప్పతనంపై అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమంలో జలవిహార్ రామరాజు, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, భక్తులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat