జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్రాజు, బోనీకపూర్లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి పవన్ కల్యాణ్ సిన్మా వార్తలపై సంచలన వ్యాఖ్యలు వేశాడు. ఇవాళ వైజాగ్ లాంగ్ మార్చ్ గురించి స్పందించిన బాలినేని పవన్ కల్యాణ్ చేసింది..లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశాడు. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి జరిగితే..పవన్ నోరు మెదపలేదని..ఇసుక దోపిడిని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకుని లాగి కొడితే చోద్యం చూసిన పవన్ ఇప్పుడు ఇసుక గురించి రంకెలు వేస్తున్నాడంటే..దాని వెనుక చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ మహిమే అని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. బాబు అడుగుజాడల్లో నడుస్తున్న పవన్కు ప్రజలు ఇచ్చిన తీర్పు అర్థం కావడం లేదని అన్నారు. విశాఖ సభలో సీఎం జగన్ పాలన మంచిగా ఉంటే నేను సినిమాలు చేసుకుంటా అని పవన్ అన్నాడని..అందుకే ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడని మంత్రి బాలినేని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కొత్త సిన్మా స్టార్ట్ చేస్తే..నిజంగానే సీఎం జగన్ పరిపాలన బాగుందని ఒప్పుకున్నట్లు అవుతుందనడంలో సందేహం లేదు.మరి పవన్ కల్యాణ్ మళ్లీ సిన్మాలు చేసుకుంటాడా..లేదా పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతాడో చూడాలి.
