ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ..ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో నాలుగు గంటల నిరాహారదీక్ష చేయగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్లో రెండున్నర కి.మీ. ల లాంగ్ మార్చ్ నిర్వహించాడు. అయితే లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్పై నిలబడి చేసిన రెండున్నర కి.మీ.ల లాంగ్ మార్చ్ హాస్యాస్పదంగా మారాయి.దీంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నాడు. నేను కూడా ఈ నెల 14 న విజయవాడలో ఇసుక దీక్ష చేస్తానని ప్రకటించాడు. ఈ మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను, మున్సిపల్ అధికారులను టీడీపీ నేతలు కోరారు. అయితే స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలు తప్పా..వేరే ఇతరత్రా కార్యక్రమాలకు అనుమతి లేదంటూ..బాబోరి దీక్షకు అధికారులు నో చెప్పేశారు. దీంతో బాబుగారు అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో దీక్ష చేస్తానని పట్టుపట్టాడు. ఈ మేరకు టీడీపీ నేతలు విజయవాడలోని ధర్నాచౌక్ను పరిశీలిస్తున్నారు. మొత్తంగా బాబోరి ఇసుక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఎత్తులు వేస్తోంది.
