ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విమర్శలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్కు నలుగురు, ఐదుగురో పిల్లలు ఉంటారు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిగారి మనవడు, వెంకయ్య నాయుడు గారి మనవడు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించారు. జగన్ విమర్శలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించాడు. నేనేమి సరదాపడి పెళ్లిళ్లు చేసుకోలేదు..వూ అంటే మూడు పెళ్లిళ్లు అంటున్నారు..మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారంటూ మండిపడ్డారు. సీఎం జగన్పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్రిటిక్ కత్తి మహేష్ ఫేస్బుక్ వేదికగా స్పందించాడు. అవును నిజమే…మీరు సరదాపడి మూడుపెళ్లిళ్ళు చేసుకోలేదు. ముందు సరదాపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే… పాపం..అంటూకత్తి మహేష్ ఎద్దేవా చేశారు. ఇక మీడియా సమావేశంలో జగన్పై విమర్శలు చేసి, తాను చెప్పాలనుకున్నది చెప్పేసి, వెంటనే హడావుడిగా వెళ్లిపోయిన పవన్ తీరుపై కత్తి మహేష్ స్పందించారు. 100 కోట్లతో సినిమాతీస్తే 1000 కోట్లు వస్తాయని గర్వపడ్డ పవన్ కళ్యాణ్…. ఆల్రెడీ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాడనే ఆశతో వెంటబడ్డ పాత నిర్మాతలు… ప్రెస్ మీట్ నుంచీ పరుగెత్తిన పవన్.. అంటూ కత్తి తనదైన స్టైల్లో వెటకారం ఆడారు. అలాగే అవసరమైతే విజయవాడలో కొట్టుకుందాం రండి…అంటూ జగన్కు చేసిన సవాల్ పై కత్తి మాట్లాడుతూ..విజయవాడ రోడ్లలో కొట్టుకోవడానికి సంసిద్ధత వ్యక్తపర్చిన పవన్ కళ్యాణ్… ఇప్పుడే మీటింగ్ నుంచీ జిమ్ కెళ్లారని సమాచారం… ఆల్ ది బెస్ట్…అంటూ కౌంటర్ ఇచ్చారు. ఊ అంటే మూడు పెళ్లిళ్లు అంటున్నారు..నేను మీకులాగా దిగజారి మాట్లాడను..తెలుగు భాష నాకు సంస్కారం నేర్పిందన్న పవన్ వ్యాఖ్యలపై కత్తి స్పందిస్తూ…తెలుగుభాష నాకు (తాట తీసే)సంస్కారాన్ని నేర్పింది అంటూ తన మీద తానే ముచ్చటపడ్డ పవన్ కళ్యాణ్… వ్యక్తిగత విమర్శ చెయ్యను చెయ్యను అంటూనే జగన్ ని ఫ్యాక్షనిస్టు అని గౌరవంగా పిల్చిన గాలిపెళ్ళోడికి నా అభినందనలు..అంటూ సెటైర్ వేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై జనసేన ఫ్యాన్స్ మండిపడుతుండగా మరొ కొందరు నెట్జన్లు మాత్రం మద్దతు పలుకుతున్నారు. మరి కత్తి మహేష్, పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలు ఎంత దూరం వెళతాయో చూడాలి. మొత్తంగా గాలి పెళ్లోడు అంటూ కత్తి పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారాయి.