Home / ANDHRAPRADESH / ఇసుకాసురుడు ఉమను పక్కన పెట్టుకుని దొంగ దీక్ష చేస్తున్న చంద్రబాబు..!

ఇసుకాసురుడు ఉమను పక్కన పెట్టుకుని దొంగ దీక్ష చేస్తున్న చంద్రబాబు..!

విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ చార్జిషీట్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌‌‌లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. టీడీపీ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా. ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలి. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. లేదంటే రేపు చంద్రబాబు చేసే దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? అంటూ పార్థసారథి మండిపడ్డారు. ఈ తప్పుడు చార్జిషీట్‌పై వైసీపీ నేతలు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ విడుదల చేసిన తప్పుడు చార్జ్‌షీట్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని సీపీని కోరామని వారు తెలిపారు. ఈ ఛార్జిషీట్‌పై డీజీ స్థాయి అధికారితో విచారణ జరిపి, ఇసుక అక్రమంగా తరలించామని తేలితే తమపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. దేవినేని ఉమా ఇసుకాసురుడని.. దొంగ ఉమాను పక్కన పెట్టుకొని దీక్ష చేసి ప్రాంగణాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. దేవినేని ఉమా ఇసుక దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తామని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. మొత్తంగా చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా టీడీపీ విడుదల చేసిన తప్పుడు చార్జిషీట్‌‌పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు లేకుండా చార్జిషీట్ రిలీజ్ చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు సీపీని డిమాండ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat