గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్పై మతం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నానా యాగీ చేస్తుంటే..మతమార్పిడులు కోసమే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడంటూ..ఎల్లోమీడియా ఛానళ్లు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తాజాగా బాబుగారికి కమ్మగా వంతపాడే చంద్రజ్యోతి పత్రిక రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించేందుకు టీటీడీ క్యాలెండరలో యేసయ్య పదం అంటూ అసత్యకథనం ప్రచురించింది. తాజాగా తన మతం, కులంపై ప్రతిపక్ష టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్న యాగీపై సీఎం జగన్ స్పందించారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పాదయాత్రలో సందర్భంగా ఎన్నికల ముందు ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం .ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చాను. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ కలిగింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా… నా కులం మాట నిలబెట్టుకునే కులం. వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నా మతం మానవత్వం..నా కులం మాట నిలబెట్టుకునే కులం అంటూ సీఎం జగన్ చెప్పిన ఒకే ఒక్క మాటతో తిరుమల డిక్లరేషన్, టీటీడీ అన్యమత ప్రచారం, మతమార్పిడులు అంటూ దుష్ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు, చంద్రబాబుకు చెంపచెళ్లుమనిపించారు.