దేశంలో ఎక్కడా లేని విధంగా మెుట్ట మొదటి సారి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే విధానాన్నిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎమ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదుల దినోత్సవ సందర్బంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబందించిన సమాచారాన్నితెలుసుకునేందుకు వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. న్యాయవాది వృత్తిలో స్థిర పడేవరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు నెలకు రూ.5000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2016 తరువాత ఉత్తీర్నులైనవారికి ఈ పథకం వర్తిసుందని ప్రభుత్వం తెలియజేసింది. న్యాయవాదుల సంక్షేమ నిథికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ దన్యవాదాలు తెలియజేసారు.
