తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కామ్ ఒకటి.. కేశవరెడ్డి తన స్కూల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా 850 కోట్ల డిపాజిట్లు సేకరించారు. తమ స్కూల్లో ఒకసారి డిపాజిట్ కడితే టెన్త్ క్లాస్ వరకూ ఫ్రీ అంటూ కేశవరెడ్డి దాదాపు 15 వేల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా 40 బ్రాంచ్ల్లో కట్టిన విద్యార్థులు ఆ తర్వాత స్కూల్ నచ్చక బయటకు వెళితే వారికి తిరిగి ఆ డిపాజిట్లను చెల్లించలేదు. కాగా ఈ కేసులో కేశవరెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ స్కామ్లో ఇప్పుడు సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం తాను నిజాయితీగా డిపాజిట్లు చెల్లిద్దామని పయత్నాలు చేస్తుంటే…మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి,ఆయన బంధువులు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ..కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి కర్నూలు జిల్లా ఎస్పీ అన్బురాజన్ను కలిసి వాపోయారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. టీడీపీ హయాంలో బయటపడిన ఈ 850 కోట్ల భారీ కుంభకోణంలో బాబు తనయుడు నారా లోకేష్తో సహా, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటాలు సెటిల్మెంట్ చేశారని, ప్రతిగా కోట్లాది రూపాయలు ముడుపులు వారికి చెల్లించామంటూ.. మధుసూధన్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు.
2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి కేశవరెడ్డి స్కూల్ కుంభకోణం బయటపడిన తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆది చక్రం తిప్పి కేశవరెడ్డికి అండగా నిలిచాడు..ఇదే విషయాన్ని మధుసూదన్ రెడ్డి చెబుతూ.. కేశవరెడ్డి డిపాజిట్ల స్కామ్ మొత్తం ఆదినారాయణ రెడ్డి కనుసన్నలలోనే జరిగిందని తెలిపారు. కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకే ఆయన టీడీపీలో చేరారని మధుసూధన్ రెడ్డి వివరించారు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు డిపాజిట్లు తిరిగి చెల్లించకుండా, టీడీపీ పెద్దలతో ఆది ఒప్పందాలు చేసుకున్నారని..ఈ మేరకు నారా లోకేష్ సెటిల్మెంట్ చేశారంటూ మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. ప్రతిగా విజయవాడ సమీపంలో అత్యంత విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని లోకేష్కు అప్పగించిన వైనాన్ని మధుసూధన్ రెడ్డి బయటపెట్టారు. అలాగే ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో మరోమాజీమంత్రి గంటాకు కూడా 5 కోట్లు ముట్టజెప్పామని మధు వివరించారు. అంతే కాదు కేశవరెడ్డి విద్యాసంస్థల్లోకి లోకేష్ బినామీలను చేర్చుకోవాలంటూ తమపై ఆదినారాయణరెడ్డి ఒత్తిడి చేశారని తెలిపారు. ప్రస్తుతం డిపాజిట్లు తిరిగి చెల్లించాలని ప్రయత్నిస్తున్న తనకు ఆది కుటుంబం నుంచి ప్రాణహానీ ఉందని..వెంటనే రక్షణ కల్పించాల్సిందిగా మధుసూధన్ రెడ్డి ఎస్పీని కోరారు. మొత్తంగా 850 కోట్ల డిపాజిట్ల స్కామ్లో నారాలోకేష్ భారీ సెటిల్మెంట్ చేశారని, ప్రతిగా కోట్లాది రూపాయల విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని అప్పగించామని కేశవరెడ్డి విద్యా సంస్థల ఛైర్మన్ మధుసూధన్ రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి ఈ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై నారా లోకేష్ ఎలా స్పందింస్తారో చూడాలి.