అమరావతి ఆందోళనల నేపథ్యంలో మచిలిపట్నంలో జోలెపట్టుకుని చంద్రబాబు చేసిన భిక్షాటనపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, గత ఐదేళ్లు అమరావతి సామ్రాజ్యానికి చక్రవర్తిలా బిల్డప్ ఇచ్చి, గ్రాఫిక్స్ రాజధానిని చూపించి జయము జయము చంద్రబాబు అని కీర్తించుకున్న బాబుగారు ఆఖరికి అమరావతిలో తన భూముల కోసం ఇలా జోలెపట్టుకుని అడుక్కునే స్థాయికి దిగజారాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. తాజాగా వైసీపీ నేత పొల్లూరి వర ప్రసాదరావు చంద్రబాబు భిక్షాటనపై అదిరిపోయే సెటైర్ వేశారు. ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే పీపీవీ తరచుగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై సెటైరికల్ ట్వీట్స్ వేస్తున్నారు. వీరిద్దరి మధ్య ట్విట్టర్లో ఏకంగా మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే అమరావతి ఆందోళనలపై పీపీపీ స్పందిస్తూ…ఐదు వేల కోట్లు హారతి కర్పూరంలా తగలబెట్టారు. ఇంకా జోలె పట్టుకుని అడుక్కునేలా ప్రతి ఆంధ్రుడిని రోడ్డుమీద పడేసారు. అదే జోలెలో మీ హెరిటేజ్ షేర్స్, జూబ్లిహిల్స్ భవనాలు కూడా దానమిస్తే..బెజవాడను, వెనిస్ ఏమిటీ…అంతకు మించిన నగరాన్ని చేద్దాం…సరిలేరు మీకెవ్వరు సార్..అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు. సరిగా సరిలేరు నీకెవ్వరు సిన్మా బ్లాక్బస్టర్ అయిన సందర్భంగా పీవీపీ చంద్రబాబుపై చేసిన ట్వీట్ చూసి మీ టైమింగ్ అదిరిపోయింది సర్..సెటైర్లు వేయడంలో సరిలేరు మీకెవ్వరు అంటూ..నెట్జన్లు పీపీపీకి రీట్వీట్ చేశారు.
