ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు ఖండించారు. కియా ప్లాంట్ను ఎక్కడకు తరలించడం లేదని..రాష్ట్రంలోనే మరింతగా విస్తరిస్తున్నామని కియా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తుందని కియా చెప్పింది. అటు తమిళనాడు ప్రభుత్వం కూడా కియా ప్లాంట్ తమ రాష్ట్రానికి తరలివస్తుందంటూ వస్తున్న వార్తలు నిరాధారమని..తమతో ఎవరూ సంప్రదించలేదని తేల్చి చెప్పింది. దీంతో కియా తరలింపుపై రాయిటర్స్లో వచ్చిన కథనం పూర్తిగా అబద్ధమని తేలిపోయింది.
అయితే రాయిటర్స్ వచ్చిన కథనంపై కియా సంస్థ, తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు అయితే అదిగో జగన్ సర్కార్లో పెట్టుబడులన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ కథనాలు ప్రసారం చేశాయి. దీంతో ప్రభుత్వం అసత్యకథనం రాసిన రాయిటర్స్పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అంతే కాదు ఈ పెయిడ్ కథనం వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. కాగా కియామోటార్స్ తరలింపు వార్తల వెనుక ఎవరు ఉన్న విషయంపై అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ పెయిడ్ కథనం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
తాాజాగా రాయిటర్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కియా తమిళనాడుకు తరలించి పోతుందంటూ ఫేక్ వార్త రాసి ప్రచారం చేసినందుకుగాను ఆదిత్య కల్రా అనే జర్నలిస్ట్ అకౌంట్ను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఫేక్ కథనాలు ప్రచారం చేయడం తమ నియమ నిబంధనలకు వ్యతిరేకం కావున ఆదిత్య కల్రా అకౌంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించినట్లు సమాచారం.. మొత్తంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు జరిగిన కుట్ర వెనుక దాగి ఉన్నవారి వివరాల్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కియాపేరుతో జగన్ ప్రభుత్వంపై విషం కక్కిన జర్నలిస్ట్ ఆదిత్య కల్రా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ కావడంతో నెట్జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రమణా..పచ్చ ఎలుకలు దొరుకుతున్నాయిరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.