ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయకులు, నేతలు లాలూచీపడి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. జగన్కు మించిన వెన్నుపోటుదారు మరొకరు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
దేశ రాజకీయాల్లో సీనియర్, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ ఇష్టమొచ్చిన భాషలో .. ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం దుర్మార్గపు చర్య అన్నారు. కేసుల నిమిత్తం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. అంతటితో ఆగక కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయించేందుకు వైసీపీ నేతలను రంగంలోకి దించారని విమర్శించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.