ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంలో చంద్రబాబు మూడు రోజుల పాటు నడిపించిన శవరాజకీయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కోడెల కేసుల్లో ఇరుక్కుని రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు ఆయన్ని పట్టించున్న పాపానా లేదు..ఒక్క రోజైనా పలకరించింది లేదు. పైగా కోడెల ఫ్యామిలీ అవినీతి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చింది..సస్పెండ్ చేయడం ఖాయమంటూ లీకులు ఇప్పించాడు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో వర్లరామయ్య వంటి టీడీపీ నేతలతో ఎల్లోమీడియా ఛానళ్లలో కోడెలను తిట్టించాడు. అంతే కాకుండా..గత కొద్ది నెలలుగా కోడెలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బాబు అవమానించారని సమాచారం. దీంతో రాజకీయంగా వత్తిళ్లు, కేసులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే కోడెల ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత..రాజకీయం చేశాడు. వైసీపీ సర్కార్ కేసులతో వేధించడం వల్లే..కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు మూడు రోజుల పాటు శవరాజకీయం చేశాడు. ఆఖరికి కోడెల అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపడానికి ముందుకు వస్తే, అధికారులను అడ్డుకుని ఆ సీనియర్ నేతను గౌరవప్రదంగా సాగనంపే అవకాశం లేకుండా చేశాడు. ఇక కోడెల అంతిమయాత్రలో విషాదంగా ఉండాల్సిన తరుణంలో కార్యకర్తలకు, ప్రజలకు విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. కోడెల ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేశారు. కోడెల కేసులకు, విచారణలకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయన ఓ డాక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు. కోడెల ఆత్మహత్య వెనుక ఏదో రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. అంతే కాకుండా అంత్యక్రియల సమయంలో విక్టరీ సింబల్ చూపించడం ఏమిటని చంద్రబాబుపై అనిల్ మండిపడ్డారు. తొలుత గుండెపోటుతో మృతి, ఆ తర్వాత ఆత్మహత్య అంటూ చెప్పారని, దీని వెనుక ఏదో మిస్టరీ ఉందని, కాబట్టి సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు తేలుతాయని అనిల్ బూరగడ్డ అన్నారు. మరి ఈ పిటీషన్పై హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.