నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట లోకేష్..ఇవాళ కూడా కూతెట్టారండోయ్.. యధావిధిగా సీఎం జగన్ను తిట్టే ప్రోగ్రాంలో భాగంగా ట్వీటేశారు. అయితే ఇవాళ చినబాబు తీసుకున్న సబ్జెక్ట్..కూరగాయల ధరలు. ఇంతకీ లోకేష్ ట్వీటేం చేశాడో మీరే చూడండి..కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి వైయస్ జగన్ గారు.. పెంచుకుంటూ పోతున్నారు అని..సెటైర్ వేశాడు.. ఉల్లి కోయకుండానే మా అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. పనులు లేకుండా చేసారు…అప్పో, సొప్పో పూట గడుపుకుందామనుకుంటే సంచి కూరగాయలు రావాలి అంటే బస్తా డబ్బులు పట్టికెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కూరగాయల ధరలు నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. 45ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని మోసం చేసారు. ఇప్పుడు కనీసం కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు అంటూ లోకేష్ ట్వీటేసి జగన్పై అదిరిపోయే పంచ్ వేశానని మురిసిపోయాడు. అయితే లోకేష్ ట్వీట్లకు వైసీపీ నేతలు ఎవరూ పెద్దగా స్పందించలేదు కాని..నెట్జన్లు మాత్రం ఓ రేంజ్లో సెటైర్లు వేశారు. రాజకీయంగా కాకుండా రైతు బిడ్డగా అడుగుతున్నా, ధరలు ఎక్కువగా ఉన్నాయి సరే, అదే ధరలు పడిపోయి రవాణా ఖర్చులకి గిట్టుబాటుకాక.. పండించిన పంటని మార్కెట్ లో రోడ్లమీద పడేసినప్పుడు… ఆ రైతులకోసం మీ హయాంలో ఏంచేశారని ఓ నెట్జన్ నిలదీశాడు.. ఇప్పుడున్నాయన అంటే సీఎం జగన్ రైతుల కోసం ఏదో చేస్తా అంటున్నాడు, చేయకపోతే ఆయన్ని కూడా విమర్శిస్తా…అంతే కాని ఇలాంటి చిల్లర ట్వీట్లు చేయకు అంటూ ఆ నెట్జన్ కౌంటర్ ఇవ్వగా..మరొక నెట్జన్ మీ హెరిటేజ్ మార్కెట్లలో కొంచెం తగ్గించి అమ్ము లోకేష్..నీ పేరు చెప్పుకుని తింటా అంటూ రీట్వీట్ చేశాడు. ఇక ఇంకో యువకుడు అయితే ఊరుకోరా బాబు..పప్పు రేటు తగ్గించారు అంటూ సెటైర్ వేయగా..మరొకతను ఏం ఫర్వాలేదు..మాకు పప్పు ఉందిలే..అంటూ ఇన్డైరెక్ట్గా లోకేష్పై జబర్దస్త్ పంచ్ వేశాడు. పాపం లోకేష్ ఏదో సీఎం జగన్పై ట్వీటేసానని మురిసిపోతే..ఇలా నెట్జన్ల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.
