వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్కల్యాణ్లు సీఎం జగన్పై, ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది.ఆఖరికి పెయిడ్ ఆర్టిస్టులతో రూపొందించిన ఫేక్ వీడియోలతో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా బుక్కైంది. అయినా ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా మార్ఫింగ్ ఫోటోలతో లోకేష్ టీమ్ ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుంది. ఇదివరకు తెలంగాణలో ధర్నా చేస్తున్న ఆశావర్కర్ల ఫోటోను మార్ఫింగ్ చేసి..సీఎం జగన్ను విమర్శించబోయి చంద్రబాబు పరువు పోగొట్టుకున్నాడు. అలాగే వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి వరద నీటిని చంద్రబాబు ఇంటికి మళ్లించారంటూ మార్ఫింగ్ ఫోటోతో లోకేష్ దొరికిపోయాడు. మొన్నటికి మొన్న జాతీయ జెండాకు వైసీపీ జెండా రంగు వేశారంటూ ఫోటో షాప్లో ఎడిట్ చేసి టీడీపీ విమర్శలు చేసింది. తాజాగా మరో మార్ఫింగ్ ఫోటోతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం, భైరిపురం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారంటూ ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ ..వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై వైసీపీ సోషల్ మీడియా టీమ్ స్పందించింది. ఆ ఫోటో లోకేష్ టీమ్ ఆధ్వర్యంలో ఫోటోషాప్లో మార్ఫింగ్ చేయబడిందని గుర్తించారు. తొలుత ఈ మార్ఫింగ్ ఫోటోను చంద్రబాబు నాయుడు ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఆ తర్వాత పవన్ కల్యాణ్కు పంపించింది. పవన్ వెంటనే ఆ ఫోటోను తన అకౌంట్లో పోస్ట్ చేసి మొన్న, ఈ రోజు..రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. 21 వ తేదీ రాత్రి 9.36 నిమిషాలకు ఈ మార్ఫింగ్ ఫోటోను నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయబడింది. రెండు గంటల తర్వాత అదే మార్ఫింగ్ ఫోటో రాత్రి 11.35 నిమిషాలకు పవన్ కల్యాణ్ తన అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా టీమ్ బట్టబయలు చేసింది. అలాగే గాంధీ విగ్రహం అసలు ఫోటోను, వీడియోను కూడా వైసీపీ సోషల్ మీడియా టీమ్ బయటపెట్టింది. మొత్తంగా మార్ఫింగ్ ఫోటోలతో సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్న చంద్ర నాయుడు, పవన్ నాయుడుల కుట్ర బట్టబయలైంది. దీంతో ఎప్పుడూ మార్ఫింగ్ ఫోటోలతో ఫేక్ ప్రచారమేనా..కాస్త కొత్తగా ట్రై చేయండి చంద్ర నాయుడుజీ..పవన్ నాయుడు జీ అంటూ వైసీపీ శ్రేణులు బాబు, పవన్లపై సెటైర్లు వేస్తున్నాయి.
ప్రజలకు మంచి చేస్తుంటే సహించలేక ఇలా అల్పబుద్ధులు చూపిస్తున్న .. చంబు నాయుడు. పాకేజ్ నాయుడు pic.twitter.com/4NJPfavvem
— phaniyadav ??YSRCP ?? (@phaniyadav11) November 22, 2019
మహాత్మా మన్నించు..!!పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్న చంద్రబాబు ఒకవైపు..ఒకరు ఉండగానే మరొకరితో సంసారం చేస్తూ ముగ్గురి భార్యలు మొగుడైన దత్తపుత్రుడు పవన్ నాయుడు మరొవైపు.. వీళ్లకు జతకలుస్తున్న" పచ్చ" బీజేపీ నేతలు ఇంకోవైపు.. వీళ్లందరూ కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి పై నీచ రాజకీయాలు చేస్తున్నారు. అయితే పచ్చ పత్రికలను మేనేజ్ చేసినంత ఈజీకాదు వైసీపీ సోషల్ మీడియాను మేనేజ్ చేయడం. అందుకే చంద్రబాబు, దత్తపుత్రుడు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు బయట పెడుతోంది వైసీపీ సోషల్ మీడియా.
Posted by YSRCP Social Media on Friday, 22 November 2019