ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడుని ఎవరూ నమ్మలేని పరిస్ధితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరానని, తెలుగుదేశం పార్టీకి, గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలోనే ఉన్నానన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచానని, అలాంటి తనను కనిగిరి నుంచి పక్కకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే నూటికి నూరుశాతం వైయస్సార్సీపీకి అనుకూలంగా ప్రాంతం, అలాంటి చోటు నుంచి తాను 2014లో 12వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాను. బాలకృష్ణ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తినని, కానీ 2019 ఎన్నికల్లో నాకు ఎలాంటి విషయం చెప్పకుండా తనను దర్శి పంపించారన్నారు. కానీ తనకు కనిగిరి కావాలని, దర్శి పోనని చెప్పడంతో చంద్రబాబు తనకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయని కొందరు పత్రికాధిపతుల కోసం తనను కనిగిరి నుంచి దర్శి పంపించారన్నారు. కనిగిరి సీటు నాకు ఇవ్వమన్నాను. అయితే ఇప్పుడు దర్శి నుంచి పోటీచెయ్.. ఎన్నికల్లో పోటీచేసి గెలిచినా, ఓడిపోయినా నిన్ను ఎమ్మెల్సీ చేస్తాను.. లేదంటే కనిగిరి ఇన్ఛార్జ్ ఇస్తామన్నారని అయితే ఇపుడు అడిగితే మాట దాటేస్తున్నారని. కుదరదని చెప్తున్నారన్నారు.. ఇలాంటి నమ్మకద్రోహమైన వ్యక్తి చంద్రబాబు అని, నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట కాబట్టి.. ఆయన్నుంచి దూరంగా ఉండాలనే వైసీపీలో చేరుతున్నారనన్రు. జగన్ మాట తప్పడు, మడమ తిప్పని వ్యక్తి అని, మాట చెపితే దానికి కట్టుబడి ఉంటారన్నారు.
