టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో విడివిడిగామాట్లాడి అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లలో కేవలం 4సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది చూడాలి.ఈ విశాఖ జిల్లాలో పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన ఉండేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చేవారం నెల్లూరు, పైవచ్చేవారం.. శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశం ఉంది.