Home / ANDHRAPRADESH / ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!

ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్న చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. వచ్చి ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే స్మశానం అంటే ఏం లేదిక్కడ అనే తప్ప..వేరే పెడార్థం తీయద్దని బొత్స పేర్కొన్నారు. తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చినబాబు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న వైయస్ జగన్ గారు అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారని లోకేష్ విమర్శించాడు. బొత్సాగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం వైకాపా నాయకులకు అర్థం అవుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారంటూ వరుసగా ట్వీట్ చేస్తూ లోకేష్ బొత్సపై విరుచుకుపడ్డాడు. అయితే ఐదేళ్లలో మూడు తాత్కాలిక భవనాలు కట్టి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి బాబుగారు కష్టపడ్డారంటూ బిల్డప్ ఇవ్వబోయి లోకేష్‌ నెట్‌జన్లకు దొరికిపోయాడు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకుని మీ కులానికి చెందిన నాయకులచే అమాయక రైతుల దగ్గర తక్కువరేటుకు కొనుక్కుంది నిజం కాదా అని నెట్‌జన్లు లోకేష్‌ను నిలదీస్తున్నారు. ఐదేళ్ల పాటు ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని విదేశాల్లో జల్సా చేసి, ఆఖరికి బాహుబలి రాజమౌళిని కూడా రంగంలోకి దింపి, ఓ ఇడ్లీ పాత్ర డిజైన్ ఓకే చేశారు.. గ్రాఫిక్స్‌తో భ్రమరావతిని చూపించి ఇదే ప్రపంచ స్థాయి నగరం అని చెబితే నమ్మడానికి నీలాగా పప్పుగాళ్లమా అంటూ నెట్‌జన్లు లోకేష్‌లపై మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చుపెట్టి లింగులిటుకు మంటూ మూడు టెంపరరీ బిల్డింగ్‌లు, అవి కూడా చిన్న వర్షం వస్తే కురిసి, నీళ్లు కారే భవనాలు కట్టించారు..ఆఖరుకు హైకోర్ట్ దగ్గర కనీసం టీ నీళ్లకే దిక్కులేదు.. పేద్ద ప్రపంచ స్థాయి నగరం అంటున్నావు..నీకేమన్నా దిమాక్ ఉందా అంటూ నెట్‌జన్లు లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు. బొత్స గారు అన్నారని కాదు కాని..నిజంగా అమరావతిలో ఏముంది..స్మశానం తప్పా..మీరు ఐదేళ్లలో చేసిన ఘన కార్యం ఇది..అంటూ లోకేష్‌పై విరుచుకుపడ్డారు. పాపం బొత్స‌కు కౌంటర్ ఇవ్వబోయి..లోకేష్ నెట్‌జన్ల చేతిలో అడ్డంగా బుక్కైపోయాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat