Home / ANDHRAPRADESH /  చంద్రబాబు అరెస్టవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు..!

 చంద్రబాబు అరెస్టవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు..!

చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, మంత్రి:
– సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు.
– రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు.
– మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్‌ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగింది?.

వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి:
– చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలి.
– ఇప్పుడు బయటపడిన రూ.2 వేల కోట్ల అవినీతిపై పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు?.
– చంద్రబాబు అవినీతిలో పవన్‌ కళ్యాణ్‌కూ భాగస్వామ్యం ఉంది.

అవంతి శ్రీనివాస్, మంత్రి:
– పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని చంద్రబాబు భావించారు.
– సీఎంగా పని చేసినప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడుగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదు.
– మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట. అడ్డంగా దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు స్పందించటం లేదు.

బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి:
– చీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు రూ.2 వేల కోట్ల స్కామ్‌ కనిపించడం లేదా?.
– ఈ స్కామ్‌లో చందబాబు పాత్ర ఉంది. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరపాలి.
– ఈ విషయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కూడా జోక్యం చేసుకుని, చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలి.

కురసాల కన్నబాబు, మంత్రి:
– చంద్రబాబు ఎంత దోచుకున్నారన్నది ఐటీ సోదాలతో తేలిపోయింది.
– చంద్రబాబు అవినీతి, దాని వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు కూడా అర్ధమైంది.
– ప్రతి రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు?.

ధర్మాన కృష్ణదాస్, మంత్రి:
– చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైంది. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా?.
– అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలి.
– ప్రజలు అవినీతిని సహించడం లేదు. పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారు.

అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి:
– చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.
– ప్రతి ప్రాజెక్టులో చినబాబుకు కమీషన్లు వెళ్లేవి.
– ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ:
– అక్రమాలు బయట పడటంతో చంద్రబాబు, లోకేష్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. అందువల్ల వారి పాస్‌పోర్టులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి.
– చంద్రబాబు అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలి.
– అమరావతి, పోలవరం పేర్లతో చంద్రబాబు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారు.

మార్గాని భరత్‌రామ్, రాజమండ్రి ఎంపీ:
– టీడీపీ నేతల అక్రమ సంపాదన ఇప్పుడు వెల్లడవుతోంది.
– కేవలం నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయి. పార్టీ ముఖ్య నేతలపై ఐటి దృష్టి సారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో?.
– ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు?.

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే.
ప్రభుత్వ చీఫ్‌ విప్‌:
– దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. ఆయన అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు.
– స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా లేదు.
– రూ.3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.
– ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకే అమరావతి అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే.
ప్రభుత్వ విప్‌:
– చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు.
– తన బినామీలపై సోదాలు జరుగుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?.
– ఈ అక్రమాలు వెలుగులోకి రాకూడదనే కృతిమ ఉద్యమం నడుపుతున్నారు.
చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలి.

కొట్టు సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే.
ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌:
– చంద్రబాబు దగ్గర పని చేసిన పీఏ నే రూ.2 వేల కోట్లు దోచుకుంటే గత అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంకెన్ని వేల, లక్షల కోట్లు దోచుకుని ఉంటాడు?
– చంద్రబాబు దగ్గర అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఉందని మేము మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. అది ఈరోజు ప్రజలందరికి తేటతెల్లమైంది.
– తన బండారం బయట పడుతుందనే అధికారంలో ఉండగా సీబీఐ, ఐటీ అధికారులు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు జీవోలు చేశారు.

కారుమూరి నాగేశ్వరరావు. తణుకు ఎమ్మెల్యే:
– చంద్రబాబు అవినీతి చిట్టాపై లోతైనా విచారణ జరపాలి. పీఏ స్థాయి వ్యక్తి దగ్గరే రూ.2 వేల కోట్ల అవినీతి బయటపడితే చంద్రబాబు అనుచరులు, కుటుంబ సభ్యుల వద్ద ఇంకా ఎంత ఉంటుంది?.
– రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.

యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు), యలమంచిలి ఎమ్మెల్యే:
– డొల్ల కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్‌ కో లక్షల కోట్లు దోచుకున్నారు.
– చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గర చాలా విషయాలున్నాయి. ఆయన డైరీని పూర్తిగా పరిశీలిస్తే భారీ అక్రమాలు బయటపడతాయి.
– విదేశాలకు పారిపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్టులు వెంటనే సీజ్‌ చేయాలి. వారిని విచారించాలి.
– చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది.

ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే:
– చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గతంలో చెప్పారు. ఆ అవినీతి బండారం ఇవాళ బయట పడింది.
– పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద పట్టుబడిన సొమ్ము చంద్రబాబుదే. అందువల్ల ఆయనను తక్షణమే అరెస్టు చేసి తీహారు జైలుకు పంపించి, అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ చేయాలి.
– ఐటి దాడుల్లో పట్టుడిన సొమ్ము ఈ రాష్ట్రానిదే కనుక, ఆ సొమ్మును అధికార వికేంద్రీకరణకు ఖర్చు పెడితే మన రాజధానులు అభివృద్ధి చెందుతాయి.

కిలారి రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే:
– తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు?.
– ఐటీ దాడులపై ఆయన నోరు ఎందుకు విప్పడం లేదు?
– పరిపాలించమని ఐదేళ్లు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు.

కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే:
– రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. 1994 నుంచే ఆయన డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు.
– ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు.
– ఇంత జరుగుతున్నా చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ నోరు ఎందుకు మెదపడం లేదు?.

డా.గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నరసారావుపేట ఎమ్యెల్యే:
– చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలి.
– అవినీతికి పాల్పడటం, కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటు.
– కానీ బయట మాత్రం తాను నిప్పునంటూ డబ్బాలు కొట్టుకుంటారు.

ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే:
– టీడీపీ ఒక పార్టీ కాదు. అది ప్రజాధనాన్ని దోచుకోనే ఒక సంస్థ.
– అమరావతిలో రాజధాని భూములు పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ అనే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్లు దోచుకున్నారు.
– ఎల్లో మీడియా రామోజీరావు, రాధాకృష్ణలు ఫోర్త్‌ ఎస్టేట్‌ను నాశనం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat