రాష్ట్ర విభజన తరువాత సుమారు రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగళవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు ఆంధ్రప్రదేశ్కు సంజీవని అయిన ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మోడీ సర్కార్ను ఎదిరించారన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
see also :
శ్రీరెడ్డి వాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..!!
ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబులా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడారని, కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఏపీలోని గల్లీల్లో పాదయాత్ర అంటూ తిరుగుతూ ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అసలు వైఎస్ జగన్ రాజకీయాలకు పనికి రారని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో వైఎస్ జగన్ ముదు వరుసలో ఉంటారని ఎద్దేవ చేశారు.