ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 142 వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్ విడుదలైయ్యింది.నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ జగన్ కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వడ్లమాను మీదుగా అగిరి పల్లి చేరుకుంటారు. రాత్రికి జననేత ఇక్కడే బసచేస్తారు.
