విశాల్, టాలీవుడ్లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో ఎత్తు. కోలీవుడ్లో కీలక పదవులు చేపట్టిన విశాల్ పరిశ్రమ అభివృద్ధి కోసం గట్టిగానే కృషి చేస్తున్నాడు. తెలుగువాడైన విశాల్ తమిళంలో ఎవరినైనా ప్రశ్నించగలిగే స్థితిలో ఉన్నాడు. ఎంతటి వారి మీదనైనా విశాల్ ధైర్యంగా విమర్శలు చేయగలడు.
అటువంటి విశాల్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 2019లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అనే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ జగన్ ప్రస్తుతం చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర చేయడం ఎవరితరం కాదని వ్యాఖ్యానించాడు. ప్రతీ గ్రామానికి వెళ్లి.. గ్రామంలోని ప్రతీ ఒక్కరిని పలకరించడం మామూలు విషయం కాదన్నారు. అందులోను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ 3వేల కిలోమీటర్లు నడిచేందుకు పూనుకోవడం ఎవరి తరం కాదంటూ.. జగన్ ప్రజల సమస్యలపై పోరాడటం సంతోషంగా ఉందన్నారు. హ్యాట్సాఫ్ జగన్ అంటూ విశాల్ అనడం గమనార్హం.
అయితే, జగన్ గురించి ఇలా శిశాల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్ గారు 3,000 వేల కిలోమీటర్లు నడవడం మామూలు విషయం కాదుప్రజల మధ్యలో ఉంటూవారి సమస్యలు వినడం గొప్ప విషయం @ హీరో విశాల్???
Publiée par Sarat Kumar Dasari sur dimanche 10 juin 2018