ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తాను చేస్తున్న పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని పదో జిల్లాగా.. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్పై పూలవర్షం కురిపిస్తున్నారు. మండుటెండలను, జడివానలను సైతం లెక్కచేయకుండా జగన్ చంద్రబాబు సర్కార్పై, అలాగే, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే.. నీ పోరాటంలో తాము సైతం అంటూ ప్రజలు జగన్ అడుగులో అడుగులు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శనివారం వైఎస్ జగన్ తన పాదయాత్రను ముమ్మిడి వరంలో కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముమ్మిడి వరానికి చెందిన 40 మంది టీడీపీ శ్రేణులు వై.ఎస్. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గేదెలపాళెం మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ బలరామ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.