ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలం.. ఆయన సామాజిక వర్గమే.. ఇది బహిరంగ వాస్తవం.. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. చంద్రబాబుకు సొంత కులస్తు నుంచి ఎదురు దెబ్బ తగులనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వలేదట.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన కమ్మ సామాజికవర్గం ఇప్పుడు ఆయనపై సానుకూలత వ్యక్తం చేస్తుందట.. తమ కులపు వారికి పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతూ తానేదో చేసానని అభిప్రాయపడుతున్నాడే తప్ప, రాజకీయాలకు అతీతంగా ఉంటే సామాన్య కమ్మలకు మాత్రం ఏవిధమైన మేలు జరగలేదట.. రాజధాని ప్రాంతంలో ఈ వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతోందట. సీఎం తమ సామాజికవర్గానికి చెందిన వాడైనా తమను పట్టించుకోవడం, పధకాలు అందడం లేదనే అసంతృప్తి పెరిగిపోయిందట.. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి తాము ప్రధాన పాత్ర పోషించామని, తమ ఆస్తులను అమ్ముకుని పార్టీ కోసం పనిచేశామనే భావన ఆ సామాజికవర్గ ఎగువ మధ్య తరగతి ప్రజల్లో బాగా ఉంది. అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగించి పనిచేసి పార్టీని నిలబెట్టామని, అటువంటి తమకు ఈ నాలుగేళ్లల్లో చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు.
బడాబాబులకు, నేతలకు, వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందికి చంద్రబాబు మేలులు చేసినా రాష్ట్ర జనాభాలో 7శాతంపైగా ఉన్నవారిలో అతి పేదరికం అనుభవిస్తున్నవారు చాలామంది ఉన్నారని వారిని చంద్రబాబు పట్టించుకోలేదనే భావన ఉంది. పారిశ్రామికవేత్తలు, ప్రతికాధిపతులు, నేతలకు మేలు జరిగితే అదంతా ఆ సామాజికవర్గానికి మేలు జరిగినట్లుగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది ఇది కచ్చితంగా అవాస్తవం.. వాస్తవానికి కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు హయాంలో నష్టమే జరుగుతోంది. ఆయన ఆ సామాజికవర్గాన్ని గుర్తించరు.. వారు వేరేపార్టీకి వెళ్లరు.. కులం కోసం పార్టీని మోస్తారు.. మళ్లీ మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు. కానీ.. వారి బాధలను మాత్రం చంద్రబాబు పట్టించుకోరు.
ఈ పరిణామాలతో ఈసారి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని ‘కమ్మ’ సామాజికవర్గ నేతలు ప్రతిపక్ష వైకాపాతో ఇప్పటికే చేతులు కలిపారు. రాబోయే రోజుల్లో మరింతమంది నాయకులు వైసీపీ తరుపున పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నసమయంలో లబ్ది పొందిన కొంత మంది కమ్మ సామాజిక పారిశ్రామికవేత్తలు. జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబు మాటలు నమ్మి రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుంది అన్న అపోహలతో చాలా ప్రాంతాల్లో విలువైన స్థలాలు కొని కోట్లాది రూపాయలు నష్టపోయిన కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. తమకు మేలు చేయని చంద్రబాబు కన్నా మేలు చేస్తాడనే పేరున్న జగన్వైపు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారట.. ఇదే జరిగితే తెలుగుదేశం ఉనికికే ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా జగన్ స్ట్రాటజీగా కూడా చెప్పుకుంటున్నారు.