Home / ANDHRAPRADESH / ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే..బీజేపీ ఎంపీ డిమాండ్…!

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే..బీజేపీ ఎంపీ డిమాండ్…!

నవ్యాంధ‌్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ సర్కార్‌ను కోరారు. . గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయిన కర్నూలు‌లో రాజధాని, హైకోర్ట్ ఏర్పాటు చేయాలంటూ టీజీ వెంకటేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే..కర్నూలులో రాజధాని హైకోర్ట్ ఏర్పాటు చేయడం ఆవశ్యకం అంటూ టీజీ వెంకటేష్ తన వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి తరలిపోతుందంటూ..టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీజీ వెంకటేష్ రాజధానిపై తనదైన స్టైల్లో స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేష్ అమరావతి రాజధానిగా ఉన్నా ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది కాని రాయలసీమకు ఒరిగేదేం లేదని, అక్కడ సీమవాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకవని ఆయన కుండబద్ధలు కొట్టేశారు.

 

 

గతంలో సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను నాలుగు రాజధానులుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే మాట చెప్పానని అన్న టీజీ ఇప్పుడు కూడా తాను అదే మాట అంటున్నానని అన్నారు. అయినా జమ్ము క‌శ్మీర్‌లో మూడు రాజధానులు, జమ్మూ, కశ్మీర్, లడక్‌‌‌లు ఉన్నప్పుడు ఏపీ ఎందుకు ఉండకూడదని టీజీ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రాయలసీమలో కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఏర్పాటు చేస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగు ప్రధాన నగరాలను రాజధానులుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. మరి నవ్యాంధ్రప్రదేశ్‌‌కు కర్నూలు రాజధాని అవుతుందా.. రాయలసీమవాసుల చిరకాల కోరిక నెరవేరుతుందా అన్నది తెలియాలంటే… మరి కొంత కాలం లేదో చూడాలి. ఆగాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat