విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతూ..విజయవంతంగా సాగుతోంది. జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు స్వయంగా భక్తుల ఇండ్లలో పాదపూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు కుందన్బాగ్లోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్ రెడ్డి స్వగృహాంలో జరిగిన పాదపూజల కార్యక్రమాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వామివారికి నల్లమనోహర్ రెడ్డి కుటుంబసభ్యులు, కాలనీవాసులు, పూలవర్షం కురిపిస్తూ, ఘనస్వాగతం పలికారు. స్వామివారికి నల్లమనోహర్ రెడ్డి కుటుంబసభ్యులు పండ్లు, ఫలహారాలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో పాదపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు స్వయంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, సనాతన హిందూ ధర్మ విశిష్టతపై అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
