ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ..టీడీపీ అధినేత చంద్రబాబు గారు విజయవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టారు. బాబుగారు ఏం చేసినా..ఈవెంట్ తరహాలో నిర్వహిస్తారు కనుక..షరా మామూలుగా ఇసుక దీక్షను కూడా ఈవెంట్ తరహాలో జరిపారు. పాపం ఆ మధ్య బాబుగారి ఓదార్పు యాత్రకు టీడీపీ నేతలు చేతిలో డబ్బులు వదిలించుకుని మరీ జనాలను తరలించి మీరు ఓడిపోవడం ఏంటయ్యా…అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టించి డ్రామా రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ బాబుగారి ఇసుక దీక్షకు టీడీపీ నేతలు ఏపీ జిల్లాల నుంచి భవన నిర్మాణ కూలీలు దొరకకపోతే..తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి 500 ఫుడ్డూ, మందూ ఇచ్చి బస్సులు పెట్టి మరీ తరలించారని సమాచారం. ఈ విషయం పక్కన పెడితే.. ఈ ఇసుక దీక్షలో అందరి కంటే హైలైట్గా నిలిచింది మాత్రం బాబుగారు ముందు కళ్లజోళ్లు పెట్టుకుని కూర్చున్న ఈ ఎల్లో బ్యాచ్..టీడీపీ కార్యకర్తలే భవన నిర్మాణ కూలీలుగా అవతారమెత్తారు. మహిళలు పసుపు చీరలు కట్టి..మెళ్లీ టీడీపీ ఐడీ కార్డులు వేసుకుని నెత్తిన పసుపు రంగు వేసిన బేసిన్లు పెట్టుకుని బాబుగారిలా విక్టరీ సింబల్ ఇస్తే..మగవాళ్లు పసుపు టీషర్ట్లు వేసుకుని నళ్ల కళ్లద్దాలు పెట్టి..నెత్తిన కార్మికులు పెట్టుకునే హెల్మెట్ పెట్టుకుని రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. అసలు భవన నిర్మాణ కార్మికుల కంటే..ఈ టీడీపీ బ్యాచ్ బాబోరి ఇసుక దీక్షలో హైలైట్ అయ్యారనే చెప్పాలి..ఇక ఈ ఎల్లో బ్యాచ్ పెట్టుకున్న నల్ల కళ్లద్దాలపై కూడా పసుపు రంగుతో జైజై చందన్న..నువ్వే రావాలి చంద్రన్న అని రాయించడం ఈ దీక్షలో కొసమెరుపు..మొత్తంగా ఈ టీడీపీ వీరసైనికుల డ్రామా బాబోరినే మించిపోయిందనడంలో అతిశయోక్తి లేదు
