ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ వీడియో తీశారు అంటూ సదరు మహిళ ఒప్పుకొంది. అయితే తే బెదిరించి డబ్బులు ఇచ్చి అసభ్యంగా మాట్లాడించి ప్రభుత్వంపై బురద చల్లాలని భావించిన అనురాధ లోకేష్ టీం గుట్టురట్టయింది. గతంలోనూ టిడిపి ఇదే మాదిరిగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, జూనియర్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.
