అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ విరుచుకుపడ్డారు. అరెస్టులు, అణచివేతలాంటి ప్రభుత్వ చర్యలతో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అయితే గతంలో చంద్రబాబు రాజధాని రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారంటూ ఇదే అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తే..పవన్ బాబు తరపున రాయబారానికి వచ్చి..రైతులు పెట్టిన పెరుగున్నం తిని..నేనున్నాని చెప్పి..వారి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. ఇప్పుడు అదే చంద్రబాబు అమరావతి కోసం రైతుల పేరుతో డ్రామాలు మొదలుపెడితే..పవన్ కూడా ఆయనకు వంతుపాడుతున్నారు. అమరావతి గ్రామాల్లో పర్యటించి రైతులను రెచ్చగొట్టారు. అంతే కాదు తనను అడ్డుకున్న పోలీసులపై ఊగిపోయారు. నడిరోడ్డు మీద కూర్చుని మరీ ఓ యాక్షన్ సీన్ను పవన్ మహాద్భుతంగా పండించారు. అసలే సినిమాల్లో మంచి నటుడైన పవన్ అమరావతిలో చేసిన ఓవరాక్షన్ చూసి టీడీపీ, జనసేన శ్రేణులు సంబురపడిపోయాయి.
గత ఐదేళ్లలో చంద్రబాబు ఎంత అరాచకం చేసినా నోరు మెదపని పవన్..ఇప్పుడు అమరావతి కోసం బెజవాడలో కవాతు చేస్తానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా అధికార, పరిపాలన వికేంద్రీకరణ కోసం అన్ని ప్రాంతాలు డెవలప్ చేసే ఉద్దేశంతో మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే..పార్టనర్లుగా ముద్రపడిన చంద్రబాబు, పవన్కల్యాణ్ చేస్తున్న రాజకీయ డ్రామాలు..ప్రహసనంగా మారుతున్నాయి.. రాజధాని రాజకీయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సీన్లు చూసి ..అబ్బబ్బ బ్బా..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఈ కామెడీ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.