మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిఅకగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో 2017 లో జగన్ ప్రత్యేక హోదా కొరకై ప్రజలతో పోరాటం చేయడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మి అధికారంతో ఆపేశారు..అప్పుడు లెక్క వేరు ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి అన్యాయం అయిపోతుందా అని నిలదీశారు. అంతేకాకుండా “నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, ఆయన మాజీ హోంమంత్రి. తన దగ్గరే మీరు పనిచేశారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసు ఆఫీసర్లపై చిందులేయడం మీ మానసిక దౌర్భల్యాన్ని బయట పెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫ్ కూడా మాటలు పడరు? అలాంటిది పోలీసు అధికారులకు వార్నింగులివ్వడమేంటి?” అని అడిగారు.
