వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరగకూడదు కరోనా ప్రభావం ఉందని మాట్లాడుతున్న బాబు అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. “పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో” అని ఎద్దేవా చేసాడు. ఇప్పటికే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటన గురించి అందరికి తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఏపీలో పెద్ద రగడ జరుగుతుంది. ఆయనపై అధికార పార్టీ సభ్యులు మండిపడుతున్నారు.